లక్నో, మార్చ్ 20: బీఎస్పీ చీఫ్ మాయావతి రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ లో బిజెపిని అంతమొందించేందుకు ఎస్పీతో బీఎస్పీ పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే ఎస్పీ, బీఎస్పీ కూటమి అభ్యర్థుల తరపున మాయవతి విస్తృతంగా ప్రచారం చేయనున్నారని స్పష్టం చేశారు. ఎస్ పి, బిఎస్ పి కార్యకర్తలు కూటమి అభ్యర్థుల విజయం కోసం పని చేయాలని ఆమె కోరారు. 80 లోక్ సభ స్థానాలు ఉన్న యుపిలో అత్యధిక స్థానాలు గెలిచే పార్టీలు కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో కీలకం కానున్నాయి. ఈ క్రమంలోనే బిజెపిని ఎదుర్కొనేందుకు ఎస్ పి, బిఎస్ పిలు జత కట్టాయి. అయితే కాంగ్రెస్ ను మాత్రం దూరం పెట్టాయి. అమేథి, రాయ్ బరేలీ స్థానాల్లో మాత్రం తమ కూటమి పోటీ చేయదని మావయతి గతంలో చెప్పిన విషయం తెలిసిందే.