కాంగ్రెస్ లోక్‌సభ అభ్యర్థుల ఆరో జాబితాను విడుదల

SMTV Desk 2019-03-21 12:58:48  congress party, loksabha elections, loksabha election candidates

న్యూఢిల్లీ, మార్చ్ 20: మంగళవారం అర్థరాత్రి కాంగ్రెస్ పార్టీ తొమ్మిది మంది లోక్‌సభ అభ్యర్థులతో ఆరో జాబితాను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని ఏడు స్థానాలకు , కేరళలోని రెండు సీట్లకు అభ్యర్థులకు ఖారారు చేశారు. అయితే కేరళలోని అలప్పుజ స్థానం నుంచి శనిమోల్‌ ఉస్మాన్‌ పోటీ చేస్తుండగా.. అట్టింగల్‌ నుంచి అదూర్‌ ప్రకాశ్‌ బరిలోకి దిగనున్నారు. ప్రస్తుతం అలప్పుజ నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ.వేణుగోపాల్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించడంతో ఆ సీటును ఉస్మాన్‌కు కేటాయించారు. మహారాష్ట్రలోని నందూర్‌బర్ నుంచి కేసీ.పడావి, ధూలే నుంచి కునాల్‌ రోహిదాస్‌, వార్దా నుంచి చారులత ఖాజాసింగ్‌, యవత్మాల్‌వాశిమ్‌ నుంచి మానిక్‌రావు జీ ఠాక్రే, ముంబయిసౌత్ సెంట్రల్‌ నుంచి ఏక్‌నాథ్‌ గైక్వాడ్‌, శిరిడి నుంచి బావుసాహెబ్‌ కాంబ్లే, రత్నగిరిసింధూదుర్గ్‌ నుంచి నవీన్‌ చంద్ర బండివడేకర్‌ పోటీ చేయనున్నారు. దీంతో కాంగ్రెస్‌ ఇప్పటివరకు మొత్తం 146 మంది అభ్యర్థులను ప్రకటించినట్లయింది.