విజయవాడ, మార్చ్ 20: రాష్ట్ర ముఖ్యమంత్రి, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు నేడు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లనున్నారు. నామినేషన్ సందర్భంగా న్యాయమూర్తి ముందు సిఎం చంద్రబాబు ప్రమాణం చేయనున్నారు. ప్రమాణం చేసిన సర్టిఫికెట్ను చంద్రబాబు కుప్పం పంపనున్నారు. కుప్పంలో నామినేషన్కు వ్యక్తిగతంగా హాజరుకాలేకపోతున్నందున.. వేరే వ్యక్తితో చంద్రబాబు నామినేషన్ పత్రాలను పంపుతున్నారు.