ముంబై, మార్చ్ 20: దేశంలో పలు చోట్ల హోలీ పండుగ సందర్భంగా పుల్వామా ఉగ్రదాడికి ప్రధాన కారణమైన జైషే మహహ్మద్ అధినేత మసూద్ అజర్ దిష్టి బొమ్మను దహనం చేశారు. అలాగే యువతరాన్ని పట్టి పీడుస్తున్న పాపులర్ మైబైల్ గేమ్ పబ్జి ల దిష్టి బొమ్మలను కూడా దహనం చేశారు. సియాన్ కోలివాడ ప్రాంతానికి చెందిన ఇద్దరు సోదరులు కలిసి ఉగ్రభూతం మసూద్ అజహర్ తోపాటు పిల్లల ప్రాణాలు తీస్తున్న పబ్ జి మొబైల్ గేమ్ దిష్టిబొమ్మలను హోలీ పండుగ వేళ దహనం చేయడం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చారు.