మార్చ్ 19: లండన్ కోర్టు భారత దేశ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీపై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి వేల కోట్లు ఎగ్గొట్టి విదేశాల్లో తిరిగితున్న సంగతి తెలిసిందే. భారత ఈడీ అధికారులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న నీరవ్ మోదీ లండన్ ఉన్నారని తేలడంతో భారత ప్రభుత్వం నీరవ్ ను తిరిగి పంపించాలని యూకే ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు మార్చి 25న నీరవ్ మోదీ కోర్టులో హాజరుకావాలని యూకే ప్రభుత్వం ఆదేశాల్లో పేర్కొన్నట్లు సమాచారం. అయితే నీరవ్ మోదీ విషయంలో అండన్ ప్రభుత్వంపై ఈడీ అధికారులు ఒత్తిడి పెంచారు.