నిర్మాణంలో ఉన్న భవనం నేలమట్టం...@100 మందికి పైగా గల్లంతు

SMTV Desk 2019-03-20 16:12:01  karntaka, dharwad, kumareshwar nagar, constructed building fall down, building collapsed

బెంగళూరు, మార్చ్ 19: కర్ణాటకలోని ధార్వాడ్‌ కుమ‌రేశ్వ‌ర్‌న‌గ‌ర్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఓ నాలుగంతస్తుల భవనం ఈ రోజు మధ్యాహ్నం కుప్పకూలింది. భవనం శిథిలాల్లో దాదాపు వంద మంది చిక్కుకున్నట్లు తెలుస్తుంది. సమాచారం అందుకోగానే పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. భవనంలో ఒకటి, రెండు అంతస్తుల్లో నిర్మాణం పూర్తయి ఇప్పటికే పలువురు అద్దెకుంటున్నారు. నాలుగో అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా ప్రమాదవశాత్తు భవనం ఒక్కసారిగా కూలిపోయింది. దీంతో దాదాపు వంద మంది శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎంత మంది గాయపడ్డరో, ఎంత మంది మరణించారో సమాచారం ఇంకా తెలియరాలేదు.