లోక్‌సభ స్థానాల్లో టాప్ లో ఎన్‌డిఎ

SMTV Desk 2019-03-20 12:54:58  loksabha elections, nda, times now, telangana, andhrapradesh, karnataka, tdp, trs, ysrcp, congress, bjp

న్యూఢిల్లీ, మార్చ్ 19: దేశంలో ఎన్నికల సమయంలో మీడియా సంస్థలు వివిధ సర్వేలు చేస్తూ ఉంటారు. కాగా రానున్న సార్వత్రిక ఎన్నికల సందర్భంగా టైమ్స్‌ నౌ-విఎమ్‌ ఆర్‌ సంయుక్తంగా ఒపీనియన్‌ పోల్‌ నిర్వహించారు. ఈ సారి ఎన్నికల్లో బిజెపి ఢంకా బజాయించడం ఖాయం అని, మొత్తం 543 లోక్‌సభ స్థానాలకు ఎన్‌డిఎ 283 లోక్‌సభ స్థానాలు గెలుచుకుంటుందని, యుపిఎ 135 స్థానాలు, ఇతరులు 125 గెలుచుకుంటారని తేల్చి చెప్పింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో టిడిపికి 3 సీట్లు, వైఎస్‌ఆర్‌సిపికి 22 సీట్లు వస్తాయని, తెలంగాణలో టిఆర్‌ఎస్‌కు 13 సీట్లు, బిజెపికి 2 సీట్లు ,కాంగ్రెస్‌కు 1 సీట్లు వస్తాయని టైమ్స్‌ నౌ తేల్చి చెప్పింది. కర్ణాటకలో మొత్తం 28 సీట్లకుగాను బిజెపి 15 సీట్లు, కాంగ్రెస్‌ 13 సీట్లు గెలుచుకుంటారని అంచనాలు వేసింది.