ముంబై, మార్చ్ 19: శాంసంగ్ స్మార్ట్ఫోన్ల లాంచింగ్పై దూకుడు పెంచింది. ఈ మధ్యే ఎ,ఎం సిరీస్లలో గెలాక్సీ ఫోన్లను తీసుకొచ్చిన శాంసంగ్ వచ్చే నెలలో మరో శాంసంగ్ గెలాక్సీ బిగ్ ఈవెంట్ నిర్వహించనున్నామని ప్రకటించింది. ఏప్రిల్ 10న ఈ ఈవెంట్ జరగనుందంటూ శాంసంగ్ ట్వీట్ చేసింది. అయితే ఈ ఈవెంట్పై పరిశ్రమ వర్గాల్లో పలు అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా ప్రీమియం మిడ్రేంజ్లో పాప్ అప్ కెమెరాతో ఏ90ను గ్లోబల్ మార్కెట్లో లాంచ్ చేయనుంది. బ్యాంకాక్, మైలాన్, సావోపోలోలో ఒకేసారి వీటిని లాంచ్ చేయనుందని భావిస్తున్నారు. అలాగే గెలాక్సీ ఏ సిరీస్లో ఏ20 స్మార్ట్ఫోన్ను తీసుకురానుందని అంచనా. దీంతో పాటు ఏ40, ఏ20ఇలను కూడా తీసుకురానుందట.