స్వతంత్ర అభ్యర్థిగా ప్రముఖ హీరోయిన్

SMTV Desk 2019-03-18 17:48:37  Sumalatha,

బెంగుళూరు, మార్చ్ 18: కన్నడ రెబెల్‌స్టార్‌ అంబరీశ్‌ భార్య, సినీ నటి సుమలత 17వ లోక్‌సభ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నట్లు సుమలత సోమవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ నుంచి ఆమెకు టికెట్‌ దక్కకపోవడంతో.. ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సుమలత నిర్ణయించుకున్నారు. కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమిలో భాగంగా మాండ్యా నియోజకవర్గాన్ని జేడీఎస్‌కి కేటాయించారు. దీంతో జేడీఎస్‌ నుండి సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌ పోటీ చేస్తున్నారు.