శ్రీనగర్ : భారత్, పాకిస్థాన్ ల మధ్య జరిగిన కాల్పుల విరమణσ ఒప్పందాని పాకిస్థాన్ పేడ చెవిన పెట్టి సరిహద్దులో పాక్ కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. సోమవారం తెలవారుజామున 5:30 గంటల ప్రాంతంలో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించారు. రాజౌరీ జిల్లాలోని సుందర్బానీ సెక్టార్లో భారత సైనిక శిబిరాలే లక్ష్యంగా చేసుకొని పాక్ రేంజర్లు కాల్పులు జరపడంతో భారత జవాను మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపలయ్యారు. పాక్ కాల్పులను భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఆదివారం కూడా రాజౌరీలో పాకిస్థాన్ కాల్పులు జరిగాయి.