హైదరాబాద్, మార్చి 18: రెండేళ్ల క్రితం టాలీవుడ్లో రకుల్ప్రీత్ సింగ్ జోరు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం వేసేది. వరుసగా టాప్ హీరోల సినిమాల్లో ఆఫర్లు సాధించి స్టార్ హీరోయిన్ అనిపించుకుంది. కానీ వరుస ఫ్లాపులు తన కెరీర్పై ప్రభావం చూపించాయి. మరోవైపు తమిళ్, హిందీ చిత్రాలను ఎక్కువగా ఒప్పుకోవడంతో తెలుగు ఆఫర్లు తగ్గాయి. మళ్లీ ఇప్పుడు మెల్లిగా టాలీవుడ్పై దృష్టిపెడుతోంది రకుల్. యంగ్ హీరో సాయిధరమ్తేజ్ నెక్స్ సినిమాలో హీరోయిన్గా ఈ భామ పేరును పరిశీలిస్తున్నారట. తేజు ప్రస్తుతం ‘చిత్రలహరి’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.
ఈ సినిమా తర్వాత మారుతి దర్శకత్వంలో నటించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని గీతాఆర్ట్ వారు నిర్మించనున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని ఈ వేసవిలోనే సెట్స్పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారట. మొదట తేజు సరసన రష్మిక మందన్న పేరును పరిశీలించినా తన బిజీ షెడ్యూల్ కారణంగా కుదరలేదట. అందుకే రకుల్ప్రీత్ సింగ్ను హీరోయిన్గా తీసుకుందామని నిర్ణయించుకున్నారని తెలిసింది. అంతా అనుకున్నట్టు జరిగితే సాయిధరమ్తేజ్, రకుల్ జోడీ కుదిరినట్టే. అయితే గతంలో తేజు, రకుల్ ‘విన్నర్’ సినిమాలో జంటగా నటించారు.