గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత

SMTV Desk 2019-03-18 08:27:40  Goa CM, Manohar parijjar

న్యూ ఢిల్లీ, మార్చ్ 17: కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కొద్దీ సేపటి క్రితం కన్నుమూసారు. ఈ రోజు ఉదయం నుంచే ఆయన ఆరోగ్యం అత్యంత విషమంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. వైద్యులు తీవ్రంగా కృషి చేసినా కూడా సాయంత్రం ఆయన తుదిశ్వాస విచిడిచినట్లు ధృవీకరించారు వైద్యులు. ఆయన మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. పారికర్ ఆరోగ్యం గత ఏడాది కాలంలో బాగా సీరియస్ అయింది. రెండు రోజుల నుంచి మరింత విషమించింది. ఈయన మరణంతో ఇప్పుడు బీజేపీ నేతలు గోవాలో రాజకీయ పరిస్థితి మీద చర్చిస్తున్నారు. గత నెలలో మనోహర్ పారికర్ పణాజీలోని గోవా మెడికల్ కాలేజ్ ఆస్పత్రిలో చేరారు. ఫిబ్రవరి 26న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గతంలో కూడా ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్‌లో, అమెరికా వెళ్లి చికిత్స చేయించుకున్నారు. గత డిసెంబర్‌లో ఆయన అమెరికా నుంచి తిరిగివచ్చారు. తన ఊపిరి ఉన్నంత వరకు కూడా ప్రజాసేవ చేస్తానని ఆయన ప్రకటించారు. అన్నట్లుగానే అలాగే చేసారు పారికర్. జనవరి 30న కూడా గోవా బడ్జెట్‌ను ఆయనే ప్రవేశపెట్టారు. ఆ సమయంలో నోటిలో ఆక్సిజన్ పైపుతో అసెంబ్లీకి రావడం పెద్ద సంచలనాన్ని సృష్టించింది.