ముంబై, ఆగస్ట్ 9: ఇటీవల ఓలా క్యాబ్ డ్రైవర్, తెలుగు డాక్టర్ ను కిడ్నాప్ చేసి కోట్ల రూపాయల డబ్బును డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇదే సంస్థకు చెందిన మరొ డ్రైవర్ నిర్వాకం బయట పడింది. పోలీసుల వివరాల ప్రకారం ముంబైకి చెందిన ఓ మహిళ, తన ఆఫీసు నుంచి ఇంటికి వెళ్లేందుకు ఓ క్యాబ్ను బుక్ చేసుకుంది. ఆమెను తదేక దృష్టితో చూస్తూ క్యాబ్ డ్రైవర్ వికృత చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని గమనించిన మహిళ, వెంటనే క్యాబ్ను ఆపి కారు దిగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.