రాజ్కోట్, మార్చ్ 16: బిజెపి మహిళా నేత రేష్మా పటేల్ పార్టీకి రాజీనామా చేశారు. రాష్ట్ర అధ్యక్షుడు జీతు వాఘానికి తన రాజీనామా లేఖను పంపారు. ఆ లేఖలో డోల్ల పథకాలను ప్రమోట్ చేసే మార్కెటింగ్ కంపెనీగా బిజెపిని అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. పోర్బందర్ పార్లమెంటరీ నియోజవర్గం నుంచి పోటీ చేయాలని కూడా నేను నిర్ణయించుకున్నాను. విపక్షాలన్నీ ఒకే వేదికపైకి వచ్చి పోర్బందర్ సీటుపై వారి వైఖరోమిటో స్పష్టం చేయాలని కోరుతున్నాను. ఇక్కడి నుంచి పోటీకి తనకు అవకాశమిస్తే మహిళా ప్రాతినిధ్యం కూడా పెరుగుతుంది’ అని రేష్మా పటేల్ అన్నారు. అలాంటి నిర్ణయమేదీ తీసుకోని పక్షంలో పోర్బందర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి, మనవదర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని చెప్పారు.