లక్నో, మార్చ్ 16: బీఎస్పీ నేత మాయావతి ప్రధాని నరేంద్ర మోదీపై మరోసారి ధ్వజమెత్తారు. ఆమె తన ట్విట్టర్ వేదికగా మోదీ తీరుపై స్పందిస్తూ... మోడి ప్రచారం కోసం దాదాపు 3044కోట్లు ఖర్చు చేసినట్లు ఆమె ఆరోపించారు. మోడి ప్రచారం కోసం పెట్టిన ఖర్చును పేద రాష్ట్రాలకు ఖర్చు చేస్తే ఆ రాష్ట్రాలు బాగుపడేవన్నారు. వెనుకబడిన యూపీ రాష్ట్రానికి ఆ నిధులు ఇస్తే, ఇక్కడ విద్యా, హాస్పటళ్లను నిర్మించేవాళ్లమన్నారు. పేదరికం, నిరుద్యోగం లాంటి అంశాలను ప్రజలు మరిచిపోయేలా మోదీ చేస్తున్నారని విమర్శించారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ,బీఎస్పీలు కలిసి పోటీ చేయనున్నాయి.