హైదరాబాద్ , మార్చ్ 16: ఛత్తీస్ గఢ్ లో అర్థరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొండన్ గావ్ జాతీయ రహదారిపై ట్రక్కు, బొలెరో వాహనం ఢీకొని 8మంది అక్కడికక్కడే మృతి చెందారు.మృతుల్లో నలుగురు మహిళలు,ఇద్దరు చిన్న పిల్లలున్నారు.ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న అధికారులు పోస్ట్ మార్టం కొరకు మృతదేహాలను కొండన్ గావ్ ఆస్పత్రికి తరలించారు. పరారీలో ఉన్న ట్రక్కు డ్రైవర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.