సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో బ్యాటరీ కార్లు

SMTV Desk 2019-03-16 13:47:03  Secunderabad Railway Station, Battery operated cars, Battery Operated car at railway station

సికింద్రాబాద్‌, మార్చ్ 16: సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లలో బ్యాటరీతో నడిచే కార్లు తాజాగా అందుబాటులోకి వచ్చాయి. వీటిని ప్రస్తుతానికి కేవలం వృద్ధులు, దివ్యాంగులు, గర్భిణుల సౌలభ్యం కోసంఅందుబాటులోకి తీసుకువచ్చామని రైల్వే అధికారులు తెలిపారు. 24 గంటలు అందుబాటులో ఉండే ఈ కార్లను రూ.45 చెల్లించి వినియోగించుకోవచ్చు. మొదటి దశలో ఐదు కార్లను అందుబాటులోకి తెచ్చామని.. తర్వలో మరిన్ని కార్లు తీసుకువస్తామని అధికారులు వెల్లడించారు.