తెలంగాణలో పదో తరగతి పరీక్షలు షురూ

SMTV Desk 2019-03-16 12:34:10  telangana ssc exams, ssc

హైదరాబాద్, మార్చ్ 16: నేటి నుండి తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షలకు నిర్ణీత సమయానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. కాగా ఏప్రిల్ 3 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2,563 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. టెన్త్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 5,52,302 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న పదో తరగతి పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్‌ అమలు చేస్తున్నారు.