వివేకా మరణం.. కొత్త మలుపు.. రక్తం తో లేఖ

SMTV Desk 2019-03-16 10:52:06  Viveka

అమరావతి, మార్చ్ 15: మాజీ మంత్రి వివేకానందరెడ్డి మరణం వెనకాల ఎవరున్నారో తెలియదు కానీ, ఇప్పటికే ఒకరిమీద ఒకరు తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా తో మాట్లాడిన జగన్ ఏపీ సీఎం చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. తన చిన్నాన్నను అన్యాయంగా పొట్టనబెట్టుకున్నారని, “మా చిన్నాన్నను చంపి ఆయనే ప్రమాదవశాత్తు చనిపోయినట్టు సృష్టించేందుకు చాలా ప్రయత్నాలు చేశారని ఆయన ఆరోపించారు. రక్తం కక్కుకుని పడిపోయినట్టు నమ్మించాలని, బాత్రూంలో కమోడ్ గుద్దుకుని ప్రాణాలు వదిలినట్టు చిత్రీకరించాలని ప్రయత్నించారు. అంతేకాకుండా ఆ హత్య నేరాన్ని మరొకరిపై నెట్టేస్తున్నారని టీడీపీ నేతపై జగన్ మండిపడ్డారు.

కాగా మా చిన్నాన్న రక్తంతో లేఖ రాసినట్టు సంఘటన స్థలంలో ఓ లేఖను పుట్టించారు. దాంట్లో డ్రైవర్ పేరు ప్రస్తావించారని, కాగా ఆ హత్య నేరం డ్రైవర్ మీదకు పోతుందని జగన్ అంటున్నారు. డ్రైవర్ మీద నేరం మోపుతున్నట్టు ఆ లేఖలో రాసింది హంతకులే. మా చిన్నాన్న చావుబతుకుల్లో ఉండి ఆ లేఖ రాశాడా? హంతకులు చూస్తుండగానే తన రక్తంతోనే తాను లేఖ రాశాడా? దీని వెనుక ఉన్న కుట్ర ఏంటో తేలాలి! అని జగన్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా మాకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని, ఈ కేసును సిబిఐ కి అప్పగించాలని జగన్ అంటున్నారు.