హైదరాబాద్, ఆగస్ట్ 8 ː హిట్ సినిమాల దర్శకుడుగా పేరొందిన కొరటాల శివ సోషల్ మీడియా వేదికగా మొట్టమొదటి సారి సినిమా గురించి కాకుండా రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. సమకాలీన రాజకీయాలపై సినీ దర్శకుడు కొరటాల శివ స్పందిస్తూ.. రాజకీయాలు పరమ చెత్తగా మారాయంటూ తొలిసారిగా పాలిటిక్స్ పై తన అభిప్రాయాన్ని ట్వీట్ చేసారు. అంతే కాకుండా, మునుపెన్నడూ లేనంతగా రాజకీయాలు భ్రష్టు పట్టి పోయాయని విమర్శించారు. మురికి పట్టిన రాజకీయాలను దేవుడు కూడా రక్షించలేకపోతున్నాడు అంటూ నిప్పులు చెరిగారు. ఈ వ్యాఖ్యల్లో అయన అసంతృప్తి, నిర్వేదం వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా కొరటాల మరో మాట కూడా అన్నారు... రాజకీయాలను మనమే, మనం మాత్రమే బాగు చేయగలం అని ట్వీట్ చేసారు. చెత్త రాజకీయాలను ప్రజలే మార్చాలన్న ఆయన మాటల్లో ప్రాధాన్యం సంతరించుకుంది.