మార్చ్ 15: వాహన తయారీ సంస్థ యమహా కంపెనీ మార్కెట్లోకి మరో కొత్త ఎంటీ-15 బైక్ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1.36 లక్షలు (ఎక్స్షోరూమ్ ఢిల్లీ). ఈ బైక్ డిజైన్ కోసం ఎంటీ-09 మోడల్ను ఆదర్శంగా తీసుకున్నట్లు అనిపిస్తోంది. ఇక బైక్ ప్రత్యేకతలు వైజెడ్ఎఫ్-ఆర్15 వీ3.0ను పోలి ఉన్నాయి. కంపెనీ ఎంటీ-15 బైక్లో 155 సీసీ లిక్విడ్ కూల్డ్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ను అమర్చింది. ఇంజిన్ మాగ్జిమమ్ పవర్ 19.3హెచ్పీ@10,000 ఆర్పీఎం. మాగ్జిమమ్ టార్క్ 14.7 ఎన్ఎం@ 8,500 ఆర్పీఎం. ఈ బైక్లో ఆరు గేర్లు, స్లిప్పర్ క్లచ్, సింగిల్ చానల్ ఏబీఎస్, ఫుల్ ఎల్ఈడీ డ్యూయెల్ హెడ్ల్యాంప్, ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ప్రత్యేకతలున్నాయి. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్ సామర్థ్యం 10 లీటర్లు. ఇది బ్లాక్, బ్లూ రంగుల్లో లభ్యం కానుంది.