మార్చ్ 15: మార్కెట్లో వెండి ధర భారీగా తగ్గుముఖం పట్టింది. కేజీ వెండి ధర రూ.410 క్షీణతతో రూ.39,300కు దిగొచ్చింది. అటు బంగారం ధర కూడా కాస్త దిగొచ్చింది. పది గ్రాముల బంగారం ధర కేవలం రూ.15 తగ్గుదలతో రూ.33,370కు క్షీణించింది. ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.15 తగ్గుదలతో రూ.33,370కు, 22 క్యారెట్ల బంగారం ధర రూ.15 తగ్గుదలతో రూ.33,200కు క్షీణించింది. ఇక ప్రభుత్వ సార్వభౌమ పసిడి పథకంలో 8 గ్రాముల బంగారం ధర రూ.26,400 వద్ద స్థిరంగా కొనసాగుతోంది. కేజీ వెండి రూ.410 తగ్గుదలతో రూ.39,300కు క్షీణిస్తే.. వారాంతపు ఆధారిత డెలివరీ ధర రూ.107 క్షీణతతో రూ.38,661కు తగ్గింది. ఇక 100 వెండి నాణేల కొనుగోలు, అమ్మకం విషయానికి వస్తే.. కొనుగోలు ధర రూ.80,000 వద్ద, అమ్మకం ధర రూ.81,000 వద్ద స్థిరంగా కొనసాగుతోంది.