హైదరాబాద్, మార్చ్ 14: టిక్కెట్ల రచ్చ సాగుతున్న సమయంలో మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ సైతం టిడిపి అధినేత కు షాక్ ఇచ్చారుశ్రీనివాసులరెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. తన అనుచరులతో సమావేశానంతరం వైసీపీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే టీడీపీని వీడిన నేతలంతా ఆ పార్టీతో పాటు చంద్రబాబుపై విమర్శలు గుప్పిస్తుంటే.. మాగుంట మాత్రం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించారు. వైఎస్తో ఉన్న అనుబంధంతోనే వైసీపీలో చేరుతున్నానని ఆయన తెలిపారు. తనకు చంద్రబాబుతో 37 ఏళ్ల అనుబంధం ఉందని అన్నారు. తనకు ఆయన ఎంతో సహకరించారని.. తాను ఎంపీగా ఓడినా కూడా ఎమ్మెల్సీగా చంద్రబాబు అవకాశం ఇచ్చారని మాగుంట కొనియాడారు.