జీ షేర్లను కొనుగోలు చేస్తున్న సోనీ!

SMTV Desk 2019-03-15 09:42:42  zee entertainments, sony, shares, shubhas chandra

ముంబై, మార్చ్ 14: జపాన్‌కు చెందిన సోనీ సంస్థ సుభాష్‌ చంద్ర నేతృత్వంలోని జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌ షేర్లను కొనుగోలు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. మొత్తం 20 నుంచి 25 శాతం వాటాలను విక్రయించాలని , విక్రయించగా వచ్చిన రూ. 13 వేల కోట్లను రుణాలు చెల్లించేందుకు వినియోగించాలని అనుకుంటున్నారు. ప్రస్తుతం ఎస్సెల్‌ గ్రూప్‌ జీలో 41.62 శాతం వాటాను కలిగి ఉంది. సగంపైగా రుణదాతల వద్ద తనాఖాలో ఉన్నాయి. ఆయన ఒక్కో షేరు రూ.650 రేటు వద్ద తన 19 శాతం వాటా విక్రయించినా రూ. 13 వేల కోట్ల వరకు పొందే అవకాశం ఉంది. సుభాష్‌ తన వద్ద దాదాపు 20 శాతం వాటా ఉంచుకోవాలనుకుంటున్నారు. ఈ విక్రయంతో సోనీ వ్యాపారం లాభపడనుంది.