రేపు తేలనున్న గ్రూప్-1, గ్రూప్-2 అభ్యర్థుల భవితవ్యం

SMTV Desk 2017-06-01 18:28:42  TSPSC,Group-1,Group-2,Ghanta Chakrapani

హైదరాబాద్, జూన్ 1 : గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాలు రేపు విడుదల చేస్తామని టీఎస్‌పీఎస్సీ (తెలంగాణా పబ్లిక్ సర్వీస్ కమీషన్) చైర్మన్ ఘంటాచక్రపాణి వెల్లడించారు. గ్రూప్-2కు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ 15 రోజుల్లోగా ధ్రువపత్రాల జాబితా వెబ్ సైట్ లో ఉంచుతామన్నారు. గ్రూప్-2 అభ్యర్థులను 1:3 నిష్పత్తి ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తామన్నారు. వెరిఫికేషన్ అనంతరం 1:2 నిష్పత్తి ప్రకారం అభ్యర్థులకు ముఖాముఖి నిర్వహిస్తామని చెప్పారు. ప్రభుత్వం నుంచి టీఎస్‌పీఎస్సీకి వచ్చిన అన్ని దరఖాస్తులను పూర్తి చేశామని తెలిపారు.