చెన్నై, మార్చ్ 14: సార్వత్రిక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ద్రవిడ మున్నేడ్ర కజగం (డీఎంకే) అధినేత ఎం.కె స్టాలిన్ జోస్యం చెప్పారు . బుధవారం తమిళనాడులోని నాగర్కోయిల్లో నిర్వహించిన ఎన్నికల సభలో ఆయన మాట్లాడుతూ.. రాహుల్ ప్రధాని అవుతారనీ, ఆయన చేతుల్లో దేశం సురక్షితంగా ఉంటుందనీ అతను చెప్పారు. రాహుల్తో కలిసి వేదికను పంచుకున్న ఆయన.. డీఎంకేతో గాంధీ కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. త్వరలో మీకు అధికారం రాబోతుంది. అది పేదవారు, సామాన్య మానవుల కోసం. మేం మీకు మద్దతిస్తున్నాం అని రాహుల్ను ఉద్దేశించి మాట్లాడారు. పార్లమెంట్ ఎన్నికల కోసం కాంగ్రెస్తో కలిసి డీఎంకే కూటమి కట్టిన విషయం విదితమే. కాంగ్రెస్ 10 స్థానాలలో పోటీ చేస్తుండగా.. డీఎంకే 20, మిత్రపక్షాలు మిగతా 6 స్థానాలలో పోటీ చేస్తున్నాయని స్థానిక సమాచారం.