పోటీకి దూరంగా ప్రియాంకా!

SMTV Desk 2019-03-14 09:21:02  congress party, loksabha elections

న్యూఢిల్లీ, మార్చ్ 13: ఈ మధ్య రాజకీయ ప్రవేశం చేసిన ప్రియాంక గాంధీ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండనున్నారు అని విశ్వసనీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ఈ మధ్యే ఆమెను కాంగ్రెస్ పార్టీ ప్రధానకార్యదర్శిగా ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నియమించారు. యుపిలో ఆమెకు కీలక బాధ్యతలు అప్పగించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండి, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం ఆమె ప్రచారం చేయనున్నారని కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. దశాబ్ధకాలం నుంచి సోనియా, రాహుల్ గెలుపునకు ఆమె విశేష కృషి చేస్తున్నారు. అమేథి నుంచి సోనియా, రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీలో ఉంటూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకు తల్లి సోనియా, సోదరుడు రాహల్ విజయం కోసం ప్రచారం చేసిన ప్రియాంక ప్రస్తుతం కాంగ్రెస్ ప్రధాన ప్రచారకర్తగా వ్యవహరించనున్నారు.