ముంబై, మార్చ్ 13: ఎన్సిపి అధినేత శరద్ పవార్ బీజేపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ...రానున్న ఎన్నికల్లో మళ్ళీ బీజేపీనే అధికారం లోకి వస్తుంది కాని నరేంద్ర మోది మాత్రం ప్రధాని కారు అని అన్నారు. బిజెపికి సొంతంగా మెజారిటీ రాదని తాను భావిస్తున్నట్లు, ఐతే దేశంలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని ,అతిపెద్ద పార్టీగా అవతరించే పార్టీకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది కానీ ప్రధానిగా మోదిని ఎన్నుకునే అవకాశం ఉండదు అని అన్నారు. ఎన్నికల తర్వాత మనందరం కొత్త ప్రధానిని చూస్తామని, మోదికి మరో అవకాశం లేదని పవార్ అన్నారు.