న్యూఢిల్లీ, మార్చ్ 13: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పోటీ చేసే అభ్యర్థుల్లో కొంత మంది రుణాలు చెల్లింపుల్లో విఫలం అయ్యారని...వారిని పోటీ చేయకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ ప్రదేశ్ బ్యాంక్ వర్కర్స్ అసోసియేషన్ తాజాగా ఎన్నికల కమిషన్ను కోరింది. అభ్యర్థులు బ్యాంకులు అందించే ఎన్వోసీ పత్రాన్ని సమర్పిస్తేనే ఎన్నికల్లో పోటీకి అనుమతించాలని పేర్కొంది. ఇలా చేస్తేనే రాజకీయ నాయకులు రుణాలు ఎగొట్టకుండా ఉంటారని తెలిపింది. ఈ విషయాలను తెలియజేస్తూ వర్కర్స్ యూనియన్ ఈసీకి ఒక ఈ-మెయిల్ పంపింది.