డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా?

SMTV Desk 2019-03-12 16:57:45  samntha,

హైదరాబాద్, మార్చ్ 12: తెలుగు టాప్ హీరోయిన్ సమంత ఏం చేసింది అంటారా? ఆమె ప్రస్తుతం కుర్ కురే ప్రాడక్ట్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది. అదే ఇప్పుడు ఆమె కొంప ముంచినట్టుంది. కుర్ కురే బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి.. కాస్త.. ఆ బ్రాండ్ ను పొగుడుకుంటూ సమంత తన ట్విట్టర్ అకౌంట్ లో ఓ ట్వీట్ చేసింది.

కుర్ కురేతో కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. కుర్ కురే తన 20వ వార్షికోత్సవం సందర్భంగా సరికొత్త కుర్ కురేను మీ ముందుకు తీసుకొచ్చింది. అదే జింజెల్లీ ఆయిల్ లో చేసిన కుర్ కురే మసాలా మంచ్ ను కుర్ కురే తీసుకువచ్చింది. ఈ సరికొత్త చట్ పటా మీకు నచ్చుతుందనుకుంటున్నా. అంటూ ట్వీట్ చేసింది సమంత.

అయితే.. ఆ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద దుమారం చెలరేగింది. అయ్యో సమంత. పోయి.. పోయి.. ఆ కుర్ కురే బ్రాండ్ కు ఎందుకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నావు. అవి ఆరోగ్యానికి హానికరం. ఇలా హానికరమైన ప్రాడక్ట్స్ ను ప్రమోట్ చేసేముందు కాస్త ఆలోచించు. వద్దు సమంతా.. నవ్వు అలా చేయకు. కొంచెం బాధ్యతగా ఉండు. ఇప్పుడు ఉన్న కాస్త ఇమేజ్ ను కూడా పాడు చేసుకోకు.. అంటూ కొంతమంది సలహాలు ఇచ్చారు. మరికొంతమంది మాత్రం డబ్బులు కోసం ఎంతకైనా తెగిస్తారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

నిజానికి కుర్ కురే లో ప్లాస్టిక్ కంటెంట్ ఉంటుందని… అది తింతే ఆరోగ్య సమస్యలు వస్తాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. కాకపోతే ప్రస్తుతం చాలామంది తమ స్నాక్స్ ఐటెమ్ గా కుర్ కురేనే వాడుతున్నారు. ఇప్పుడు ఇది పాపులర్ స్నాక్ ఐటమ్. మరి.. నెటిజన్ల సలహాలపై సమంత ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.