పాట్నా, ఆగస్ట్ 7 : బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ ఈ రాఖీని వినూత్న రీతిలో జరుపుకున్నారు. సందేశాత్మకంగా ఉండాలన్న ఉద్దేశంతో కొత్తగా వారిద్దరూ మొక్కలకు రాఖీలు కట్టారు. రాష్ట్రాన్ని హరిత రాష్ట్రంగా అభివృద్ది చేయడంతో పాటు ప్రజలు వాటిని సంరక్షించాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నట్లు తెలిపారు. ఇది పర్యావరణానికి అత్యంత ముఖ్యమైన ఉద్దేశం. మొక్కలకు రాఖీ కట్టడం అనేది మొక్కలను సంరక్షించి వాటిని హరితవనంలా పెంచాలని చాటి చెప్పేందుకు సంకేతమని నితీష్ కుమార్ వివరించారు. పర్యావరణాన్ని రక్షించాల్సిన బాధ్యత పూర్తిగా మనపైనే ఉందంటూ ఆయన అభిప్రాయపడ్డారు. కాగా ఈ సందేశాన్ని స్పూర్తిగా తీసుకొని ఇప్పటికే చాలామంది అమలు చేస్తున్నట్లు తెలిపారు.