న్యూఢిల్లీ, ఆగష్ట్ 7: పాకిస్తాన్-భారత్ అనగానే వైరం మాత్రమే గుర్తు వస్తుంది. కానీ, ఈ రెండు దాయాది దేశాల మధ్య సోదరసోదరిమణుల మమకారం కూడా ఉంది అనడానికి ఈ సంఘటనే ఉదాహరణ. గత 23 ఏళ్లుగా పాకిస్తాన్కు చెందిన ఓ మహిళ ప్రధాని మోదీకి రాఖీ కడుతున్నారు. అంతేకాకుండా మోదీ స్వయంగా ఆమెకు ఫోన్ చేసి ఆహ్వానించి మరీ రాఖీ కట్టించుకుంటారు. ఆమె పేరు ఖమర్ మోసిన్ షేక్, పెళ్లి చేసుకున్న అనంతరం ఆమె భారత్లో నివాసం ఉంటుంది. నేను మోదీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉన్నప్పటి నుంచి రాఖీ కడుతున్నాను ఈసారీ ప్రధానిగా మోదీ బిజీగా ఉండటం వల్ల కట్టలేను ఏమో అనుకున్నాను. కానీ, రెండు రోజుల క్రితం ఆయనే ఫోన్ చేసి ఆహ్వనించారంటూ ఆమె ఆనందాన్ని వ్యక్తంచేశారు. కృషి, పట్టుదలతో పని చేస్తే ఒక వ్యక్తి ఏలా ఉంటారని చెప్పడానికి మోదీయే ఉదాహరణ అని ఆమె ప్రధానిని కొనియాడారు.