జమ్మూకశ్మీర్‌లో అనుమానిత ఉగ్రవాది అరెస్ట్‌

SMTV Desk 2019-03-12 12:27:50  jammu kashmir, terrorist,

జమ్మూకాశ్మీర్ , మార్చ్ 12: పూంఛ్‌ జిల్లాలో ఆర్మీ క్యాంపు వద్ద సంచరిస్తున్న ఓ ఉగ్రవాదిని స్థానిక పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రెండు గ్రనేడ్లు, ఓ డిటోనేటర్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ జరుగుతున్న సమయంలో అక్కడ అనుమానాస్సదంగా తిరుగుతుండడంతో అరెస్టు చేశామని పోలీసులు ఈ మేరకు తెలిపారు. అరెస్టు అయిన ఉగ్రవాది కాలకోటే ప్రాంతానికి చెందిన రాజీందర్ సింగ్ గా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. రాజీందర్ సింగ్ ఏ ఉగ్రవాద సంస్థకు చెందినవాడు, అతడికి ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చాయన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఇటీవల జమ్ము బస్టాండ్ లో గ్రనేడ్ పేలి ఇద్దరు చనిపోగా, మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో ఉగ్రవాదులు జన సమూహం ఉన్న చోట పేలుళ్లకు పాల్పడే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు, ఆర్మీ అప్రమత్తమై తనిఖీలు చేస్తున్నారు.