బిజీ బిజీ గా అనుష్క .. మరో చిత్రానికి లైన్ క్లియర్ ..

SMTV Desk 2019-03-12 11:03:46  ANushka,

హైదరాబాద్, మార్చ్ 12: తెలుగు టాప్ హీరోయిన్ అనుష్క ‘బాహుబలి’ చిత్రం తర్వాత ఇండియాలోనే కథానాయికగా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఈ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతుందని అంతా భావించారు. అయితే అనుష్క ‘సైజ్ జీరో’ సినిమాలో నటించింది. ఈ సినిమా కోసం లావు కావడం ఆమెకు మైనస్‌గా మారింది. దీంతో దాదాపు సంవత్సరం పాటు ఈ బ్యూటీ కెమెరాకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈమధ్య కాస్త సన్నబడ్డ అనుష్క మళ్లీ సినిమాలు చేసేందుకు సిద్ధమైంది. ఈ సమయంలో ఆమెకు అన్నీ లేడీ ఓరియెంటెడ్ పాత్రలే దక్కుతున్నాయి. తెలుగులో ఇప్పటికే ఆమె ఒక చిత్రానికి కమిట్ అయింది. ఆ సినిమాలో కీలక పాత్రలో మాధవన్ నటించబోతున్నాడు.

ఈ సినిమాతో పాటు స్వామి అయ్యప్ప కథాంశంతో తెరకెక్కబోతున్న చిత్రంలో నటించేందుకు కూడా అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. మలయాళం, తెలుగు, తమిళం, హిందీ, కన్నడం భాషలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. సంతోష్ శివన్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుందట. గతంలో అనుష్క ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రంలో కృష్ణమ్మ అనే పాత్రలో నటించింది. అలాంటి పాత్రనే అయ్యప్ప సినిమాలో కూడా ఆమె చేయబోతున్నట్లుగా తెలిసింది.