దూకుడు మీదున్న అమ్‌ ఆద్మీ పార్టీ

SMTV Desk 2019-03-12 09:27:50  AAP,

న్యూ ఢిల్లీ, మార్చ్ 12: లోక్‌ సభ ఎన్నికల ప్రిపరేషన్‌ లో అమ్‌ ఆద్మీ పార్టీ అన్ని పార్టీల కంటే ముందుంది. కాంగ్రెస్‌, బీజేపీ పార్టీలు అభ్యర్థులపై కసరత్తు చేస్తుండగా…, ఆప్‌ మాత్రం ఆరు లోక్‌ సభ స్థానాలకు అభ్యర్థులను ఈ మేరకు విడుదల చేసింది .. ప్రచారానికి సైతం శ్రీకారం చుట్టింది. లోక్‌సభ ఎన్నికల ఇన్‌ఛార్జిని ఆరు నెలల క్రితమే నియమించిన ఆప్‌, అంతే సమయంతో అభ్యర్థులను ఎంపిక చేసింది. దీంతో పాటు డోర్ టూ డోర్ క్యాంపెయిన్, బహిరంగ సభలు, పర్యటనలు నిర్వహించడంతో పాటు బూత్ స్థాయి కార్యకర్తల టీమ్‌ను కూడా సిద్ధం చేసింది. ప్రచార సామాగ్రిని సిద్ధం చేసిన ఆప్‌ నేతలు ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.