న్యూ ఢిల్లీ, మార్చ్ 12: కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. బీజేపీ నేతలపై విమర్శించే క్రమంలో ఓ వివాదాస్పత వ్యాఖ్య చేశారు. గతంలో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ మసూద్ అజర్ ను బీజేపీ ప్రభుత్వమే వదిలిపెట్టిందని రాహుల్ పలు మార్లు విమర్శించారు. ఈ నేపథ్యంలోనే.. మరోసారి మసూద్ అజర్ గురించి మాట్లడుతూ.. అతన్ని’ జీ’ అంటూ సంభోదించారు. దీంతో ఉగ్రవాదుల పట్ల రాహుల్కు ఎంత గౌరవమో అంటూ పలు రాహుల్ పై విమర్శలు కురుస్తున్నాయి. పాకిస్థానీలకు, రాహుల్కు తేడా ఏమీ లేదు, ఇద్దరూ ఉగ్రవాదులను ప్రేమించే వారే అంటూ బీజేపీ నేతలు రాహుల్పై మండిపడుతున్నారు. ఎంతో మంది భద్రతా బలగాల చావులకు కారణమైన మసూద్ ను ‘గారు’ అంటూ సంభోదించడాన్ని పలువురు తీవ్రంగా ఖండిస్తున్నారు.