ముంబై, మార్చి 11: ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా ముద్దుల తనయ అనన్య బిర్లాను కొందరు సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేశారు. ఆమె "మిలియనీర్ కిడ్" అని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. దీనిపై అనన్య కాస్త ఘాటుగా స్పందించారు. తాను ఎవరి కూతుర్నైనప్పటికీ, తానూ ఒక మనిషినేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలంటూ ఘాటుగా సమాధానమిచ్చారు.
"నేను మిలియనీర్ కూతుర్ని అయితే ఏంటి? నేనూ మనిషినే. మా కష్టార్జితంతోనే మేం ఈ స్థాయికి చేరుకున్నాం. ఈ విషయాన్ని కచ్చితంగా ఇతరులతో పంచుకోవాలి. ఇంకో విషయం.. మీరన్నట్టు మా నాన్న మిలియనీర్ కాదు.. బిలియనీర్" అని ట్వీట్లో పేర్కొన్నారు.