చంద్రబాబు మోసపూరిత మాటలు వినొద్దు .. జగన్

SMTV Desk 2019-03-12 07:40:57  chandrababu, YSRCP,

విజయవాడ, మార్చ్ 11: సార్వత్రిక ఎన్నికల నగారా మోగిన విషయం తెలిసిందే కాగా ఇదే సమయంలో ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వేదికగా సోమవారం ఎన్నికల సమర శంఖారావం పూరించారు. తూ.గో జిల్లా నుంచే మార్పుకు నాంది పలుకుతూ ఎన్నికల ప్రచారానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారు. కాకినాడలో వైసీపీ ఏర్పాటు చేసిన సమర శంఖారావ సభకు హాజరైన వైయస్ జగన్ మోహన్ రెడ్డి అశేష జనసముహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. వేదికపై వైఎస్‌ జగన్‌ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్ని కూడా నేరవేరుస్తానని ఈ సందర్భంగా జగన్ అన్నారు. అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని అన్నారు. అందరూ కోరుకునే రాజన్న రాజ్యం కోసం అందరూ కోరుకుంటున్నారని తప్పకుండా రాజన్న రాజ్యం వస్తుందని అన్నారు. చంద్రబాబు మోసపూరిత మాటలు నమ్మరాదని ఈ సందర్భంగా పెర్కోన్నారు. దోపిడీకి పాల్పడ్డ టీడీపీకి శాంతియుతంగా సమాధి కట్టాలని పిలుపునిచ్చారు. సంక్షేమ పథకాలు అమలుకావాలంటే రాజన్న రాజ్యం రావాలని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు.