రాజమండ్రి, అమలాపురం జనసేన ఎంపీ అభ్యర్థులు

SMTV Desk 2019-03-12 07:39:48  Rajamanri, Janasena,

విజయవాడ, మార్చ్ 11: సార్వత్రిక ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెడీ అయ్యారు అభ్యర్థుల జాబితా కూడా రెడీ చేసినట్లు ప్రకటించింది. తొలి విడత జాబితాలో 32 అసెంబ్లీ, 9 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఆ పార్టీ పేర్కొంది.

ఇందులో రెండు పార్లమెంటు స్థానాలకు ఖరారు చేసిన అభ్యర్థులను జనసేన ప్రకటించింది. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఆకుల సత్యనారాయణ, అమలాపురం ఎంపీ అభ్యర్థిగా డీఎంఆర్ శేఖర్ లను పవన్ ఖరారు చేశారు. ఈ సాయంత్రంలోగా మిగిలిన అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యే అవకాశం ఉంది.