నాలుగో వన్డే పరాజయం : పంత్ ను విపరీతంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

SMTV Desk 2019-03-12 07:28:18  india vs australia, 4th odi, rishab pant, mahendra singh dhoni, virat kohli

మొహలీ, మార్చ్ 11: ఆదివారం భారత్, ఆస్ట్రేలియాల మధ్య జరిగిన నాలుగో వన్డేలో టీంఇండియా పరాజయపాలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం టీం ఇండియా జట్టు యువ క్రికెటర్ రిషబ్ పంత్ అని క్రికెట్ అభిమానులు అతనిపై మండిపడుతున్నారు. భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఆసిస్ తో జరిగే చివరి రెండు వన్డేలకు విశ్రాంతినిచ్చింది. మహీ స్థానం లోకి వచ్చిన పంత్ బ్యాటింగ్ బాగానే ఆడినా...వికెట్ కీపింగ్ లో మాత్రం కాస్త తడబడ్డాడు. సులువైన క్యాచ్‌తో పాటు రెండు కీలక స్టంపౌట్‌లను చేజార్చి అతను భారత విజయావకాశాలను దెబ్బ తీశాడు. ఓ స్టంపౌట్‌ను ధోని స్టైల్‌లో చేయబోయి విఫలమవ్వడంతో గ్రౌండ్‌లోని ప్రేక్షకులు ఆ సమయంలో ధోని..ధోని అంటూ నినాదాలు చేశారు. ఇక విరాట్ కోహ్లీ అయితే పంత్ పట్ల అసహనం వ్యక్తం చేశాడు. మరోవైపు రిషబ్ పంత్‌పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైరవుతున్నారు. అంపైర్.. ఇప్పుడు పంత్‌ను మార్చవచ్చా అని కోహ్లీ అడుగుతున్నట్లుగా ఉన్న మీమ్ వైరల్ అవుతోంది.