అమెరికాలో నూతన మహిళా సంఘం

SMTV Desk 2019-03-12 07:21:52   america, women empowerment telugu association, tata company, ex chief jhansi reddy

అమెరికా, మార్చ్ 11: అమెరికాలో తెలుగు మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సంఘం ఏర్పాటు అయ్యింది. టాటా మాజీ అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి ఈ మహిళా సంఘాని ఏర్పాటు చేసింది. ఉమెన్‌ ఎంపవర్‌మెంట్‌ తెలుగు అసోసియేషన్‌ పేరుతో ఈ సంఘాన్ని ఆమె ఉమెన్స్‌ డే రోజున ప్రకటించారు. ఈ సంఘానికి సంబంధించిన లోగోలో ఇది తెలుగు మహిళల కోట, స్త్రీ ప్రగతి పథమే మా బాట అని పేర్కొన్నారు. కాగా ఈ సంఘానికి అడ్వయిజరీ కౌన్సిల్‌ చైర్‌, ప్రెసిడెంట్‌ కూడా అయిన ఝాన్సీరెడ్డి ఈ సంఘం ద్వారా మహిళ నాయకత్వ శక్తిని ప్రపంచానికి చాటుతామన్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇప్పుడు ఉంటున్న తెలుగు సంఘాలలో తగు న్యాయం జరగడం లేదని అందుకే కొత్తగా కేవలం మహిళల కోసమే ఈ కొత్త సంఘాన్ని ఏర్పాటు చేశామని ఝాన్సీ రెడ్డి తెలిపారు.