సుమలతకు బహిరంగంగా క్షమాపణలు చెప్పిన కుమారస్వామి

SMTV Desk 2019-03-12 07:19:52  Kumaraswami,

బెంగుళూరు, మార్చ్ 11: ప్రముఖ సినీనటి సుమలతకు.. కర్ణాకట ముఖ్యమంత్రి కుమారస్వామి.. బహిరంగ క్షమాపణలు తెలిపారు. ‘భర్త మృతి చెంది రెండు నెలలు కాలేదు.. అప్పుడే సుమలతకు రాజకీయాలు అవసరమా’ అంటూ.. కుమారస్వామి సోదరుడు, మంత్రి రేవణ్ణ వివాదాస్పద కామెంట్స్ చేసిన సంగతి విదితమే. తన సోదరుడి వ్యాఖ్యలకు కుమారస్వామి క్షమాపణ చెప్పారు. మీడియా మిత్రులు రేవణ్ణను ఉద్రేకపరిచేలా ప్రశ్నలు అడిగారని... ఆ తరుణంలోనే ఆవేశంలో ఆయన అలా మాట్లాడారని అన్నారు. కొంచెం శాంతంగా ఆలోచించి సమాధానం చెప్పి ఉంటే... ఎవరికీ బాధ కలిగి ఉండేది కాదని అన్నారు. మహిళలను కించ పరిచే సంస్కృతి తమ కుటుంబంలో లేదని చెప్పారు.ఇదిలా ఉండగా మండ్యలో మీడియాతో మాట్లాడిన జేడీఎస్‌ అభ్యర్థి నిఖిల్‌ కూడా సుమలతకు క్షమాపణలు చెప్పారు. ఏ సందర్భంలో మంత్రి రేవణ్ణ అలా వ్యాఖ్యానించారో తెలియదని జేడీఎస్‌ పార్టీ మహిళలంటే ఎనలేని గౌరవం ఇస్తుందన్నారు.