ప్రేటోరియా/ఆఫ్రికా, మార్చ్ 11: ఇథియోపియాలో బోయింగ్ 737–8 మ్యాక్స్ విమానం కుప్పకూలి 157మంది మృతి చెందారు. అడిస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబి బయల్దేరిన విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 157 మంది చనిపోయారు. ఈ సంఘటనలో మృతి చెందిన వారిలో నలుగురు భారతీయులతో పాటు 33దేశాలకు చెందిన ప్రయాణికులున్నారు. నలుగురు భారతీయులలో గుంటూరుకు చెందిన నూకవరపు మనీషా కూడా ఒకరు. ఆమె గుంటూరులో ఎంబీబీఎస్ పూర్తిచేసి అమెరికాలో ఎంఎస్ చేసి అక్కడే స్థిరపడ్డారు. నైరోబీలో ఉన్న తన అక్కను చూసేందుకు వెళుతుండగా దురదృష్టవశాత్తు విమానప్రమాదంలో మరణించారు. అయితే, ఈ ప్రమాదంలో మృతి చెందినవారిలో శిఖా గార్గ్, వైద్య పన్నగేష్ భాస్కర్, వైద్య హంసిన్ అన్నగేష్, నూకవరపు మనీషలను భారతీయులను అధికారులు గుర్తించారు. వారిలో శిఖా గార్గ్ అనే యువతి ఐక్యరాజ్యసమితిలో భారత్ ప్రతినిధిగా పనిచేస్తున్నారు.