మళ్ళీ సీఎం కానున్న పన్నీర్‌ సెల్వం..?

SMTV Desk 2017-08-07 15:15:46  PANEERSELVAM, MINISTER PANDYA RAJAN, DENGI FEVER

చెన్నై, ఆగస్ట్ 7 : తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం తిరిగి మళ్లీ తమిళనాడు సీఎం అవుతారని మాజీ మంత్రి పాండ్యరాజన్‌ అన్నారు. జయలలితకు నమ్మిన బంటుగా పేరు గాంచిన పన్నీర్‌ సెల్వం నేతృత్వంలోని అన్ని అన్నాడీఎంకేలోని వర్గాలు మళ్లీ ఏకమవుతాయని తన ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. కాగా ప్రభుత్వం రాష్ట్రంలో డెంగీ జ్వర తీవ్రతను నియంత్రించడంలో మాట ఇచ్చి విఫలమైందని ఆరోపిస్తూ అన్నాడీఎంకే వర్గం నేతృత్వంలో ఈ నెల 10 న నిరసనకు పిలుపునిచ్చారు. భవిష్యత్తులో మరిన్ని ఆందోళనలను చేపట్టేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఇటీవల పన్నీర్‌ సెల్వం వస్తున్న సమయంలో ఓ వ్యక్తి కత్తితో పట్టుబడిన నేపథ్యంలో పలువురు నేతలు ఆయనకు భద్రతగా నిలిచినట్లు వివరించారు.