న్యూఢిల్లీ, మార్చ్ 11: లోక్ సభతో పాటు నాలుగు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఆదివారం విడుదల చేసింది. ఈ నేపథ్యంలో షెడ్యూల్ విడుదలైన వెంటనే భారత ప్రధాని మోదీ తన అధికారిక ట్విట్టర్ ద్వారా స్పందించారు.
ప్రజాస్వామ్య పండుగకు చెందిన ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. అందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. తొలి సారి ఓటు వేయబోతున్న వారు రికార్డు స్థాయిలో ఓటు హక్కును వినియోగించుకోవాలి.
ఎన్నికల కమిషన్ కు, ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, భద్రతా సిబ్బందికి అభినందనలు. ఎన్నో ఏళ్లుగా ఎన్నికలను సక్రమంగా నిర్వహిస్తున్న ఎన్నికల కమిషన్ ను చూసి గర్విస్తున్నా, అంటూ ట్వీట్ చేసారు.