మొహాలి, మార్చ్ 10: భారత్, ఆసిస్ మధ్య జరుగుతున్న ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా నేడు పంజాబ్ లోని మొహాలీ స్టేడియం వేదికగా 4 మ్యాచ్ మొదలయ్యింది. నాల్గో వన్డేలో మొదట టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా మొదటి మూడు వన్డేలో భారత్ రెండు గెలిస్తే, కంగారులు ఒకటి గెలిచారు. అయితే ఈ మ్యాచ్ లో గెలిస్తే సిరీస్ టీమిండియా కైవసం అవుతుందన్న పట్టుదలతో క్రీజులోకెల్లిన కోహ్లీ సేనా ఆసిస్ ముందు 359 పరుగుల లక్ష్యాన్ని ముందుంచారు. ఇక క్రీజులోకి వెళ్ళిన ఆసిస్ కు ఆదిలోనే పరాభవం ఎదురైంది. ఆసీస్ కెప్టెన్, ఓపెనర్ ఆరోన్ ఫించ్ (0) పరుగులేమి చేయకుండానే పెవిలియన్ చేరాడు. భారత స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ నాలుగో బంతికి ఫించ్ క్లీన్బౌల్డ్ అయ్యాడు.అనంతరం బూమ్రా బౌలింగ్లో షాన్ మార్ష్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రస్తుతం క్రీజ్లో ఖవాజా 80 పరుగులు, హాండ్స్ కాంబ్ 70 పరుగుతలతోనూ ఆడుతున్నారు. ప్రస్తుత స్కోరు 176/2 పరుగుల వద్ద ఉంది.