తిరువనంతపురం, మార్చ్ 10: కేరళ రాష్ట్రంలోని డెమోక్రటిక్ ఫ్రంట్ లోక్ సభ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఈ ఫ్రంట్ లోని సీపీఎం 16 స్థానాలకు, సీపీఐ 4 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. తాజాగా కేరళలోని 20 లోక్ సభ స్థానాలకు సీపీఎం, సీపీఐలు పోటీ చేస్తున్నట్లు ప్రకటించాయి. ఫ్రంట్ విడుదల చేసిన జాబితాలో నలుగురు సిట్టింగ్ ఎంపీలుండగా, నలుగురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. 20 మందిలో ఇద్దరు మహిళలకు చోటు కల్పించారు.