తిరుమల, మార్చ్ 10: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ అధికంగా పెరిగింది. శ్రీ వారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారి దర్శనం కోసం అన్ని కంపార్ట్మెంట్లు నిండి వైకుంఠం వెలుపల కిలోమీటరు మేర భక్తులు క్యూలైన్లలో బారులుతీరారు. శ్రీవారి సాధారణ సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. నిర్దేశిత దర్శనం టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని 78,188 మంది భక్తులు దర్శించుకున్నారు.