ఒడిశా సీఎం నవీన్‌ పట్నాయక్‌ సంచలన ప్రకటన

SMTV Desk 2019-03-11 07:21:01  Odisha CM Naveen Patnaik, lok sabha elections,

భువనేశ్వర్, మార్చ్ 10: ఒడిశా ముఖ్యమంత్రి, బిజు జనతా దళ్‌(బీజేడీ) చీఫ్‌ నవీన్‌ పట్నాయక్‌ ఓ కీలక ప్రకటన చేశాడు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మహిళలకు 33శాతం టికెట్లు ఇస్తామని ప్రకటించారు. ఇదివరకు ఇలాంటి ప్రకటన దేశంలోనే ఎవ్వరు చేయలేదని...మొట్టమొదటి సారిగా ఈ ప్రకటన చేసింది నవీన్‌ పట్నాయకే అని చాలా మంది ప్రశంసలకు అందుకుంటున్నారు. ఈ నిర్ణయంపై నవీన్‌ పట్నాయక్ లాంటి గొప్ప నేత తీసుకున్న ఈ నిర్ణయం చాలా అద్భుతమైనదని బీజేడీ ఎంపీ పినాకీ మిశ్రా అన్నారు. ఇదొక విప్లవాత్మకమైన నిర్ణయమని ఆమె చెప్పకొచ్చారు. ఇప్పటికే నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా ఉన్న పట్నాయక్.. ఈ సారి కూడా సీఎం పీఠంపై కూర్చోవాలని ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇలాంటి కీలక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో ఇప్పుడున్న ఎంపీల్లో కొంత మందికి టికెట్లు ఇవ్వకూడదని బీజేడీ నిర్ణయించింది. కాబట్టి వారి స్థానాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ.. ఈసారి మహిళలకు 33 శాతం టికెట్లు ఇవ్వనున్నట్లు నవీన్‌ పట్నాయక్‌ తెలిపారు.