మార్చ్ 10: దిగ్గజ ఈ-కామర్స్ సంస్థ పేటీఎం మరో సంచలన నిర్ణయం తీసుకోనుంది. ప్రముఖ సంస్థలైన అమెజాన్, ఫ్లిప్కార్ట్లకు పేటీఎం షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అమెజాన్ తన యూజర్లకు అమెజాన్ ప్రైమ్ సర్వీసులు అందిస్తోంది. ఫ్లిప్కార్ట్ తన యూజర్లకు ఫ్లిప్కార్ట్ ప్లస్ కింద ఎక్స్క్లూజివ్ సేవలు ఆఫర్ చేస్తోంది. ఇప్పుడు పేటీఎం కూడా వీటి దారిలోనే నడిచేందుకు సిద్ధమైంది. దేశంలోని ప్రముఖ మొబైల్ వాలెట్ సేవల సంస్థ పేటీఎం ఇప్పుడు ‘పేటీఎం ఫస్ట్’ పేరుతో ప్రీమియం సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ఆవిష్కరించింది. ఇందులో రెగ్యులర్ ఆఫర్లకు పైన మళ్లీ ప్రత్యేకమైన ప్రయోజనాలు పొందొచ్చు. యూజర్లు పేటీఎం ఫస్ట్ సేవల కోసం ఏడాదికి రూ.750 చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధర అమెజాన్ ప్రైమ్ కన్నా తక్కువ. క్యాష్బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. తొలి 1500 సబ్స్క్రైబర్లు రూ.100 క్యాష్బ్యాక్ పొందొచ్చు. అంటే రూ.650కే ‘పేటీఎం ఫస్ట్’ సేవలు పొందొచ్చు. ప్రస్తుతం ఈ సేవలు ఆండ్రాయిడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఐఓఎస్ యూజర్లకు కూడా ఈ సేవలు అందుబాటులోకి రానున్నవి.